మానవీయుడే
-శాంతిశ్రీ
గురించిన కొన్ని విషయాలే బయటకు వెల్లడవుతాయి. అవీ వారి జీవితంలో ఒక పార్శ్వాన్ని మాత్రమే తెలియచేస్తాయి. అలాగే కొందరు తమ గురించి బయటకు తెలపడానికి ఇష్టపడరు. కానీ మహనీయులు తమ తదనంతరమైనా తమ గురించిన పూర్తి వివరాలు వెల్లడించడం వల్ల ముందుతరాలకు ఉపయోగమే కానీ, నష్టమేమాత్రం ఉండదు. ఈ రోజు మావో గురించిన విషయాలు తెలుసుకుంటున్నామంటే ఆయన ముందుచూపే కారణమనిపిస్తోంది. తన అంగరక్షకునితో ఆయన చెప్పిన మాటలు దాన్నే వెల్లడిస్తున్నాయి. 'నా కుటుంబంలో జరిగిన విషయాలు ఇతరులకు రహస్యాలు. కానీ నీకు కాదు. నేను చనిపోయేవరకూ నా గురించి ఏమీ రాయవద్దు. ఆ తర్వాత రాయదలుచుకుంటే వాస్తవాలనే రాయి' అని మావో తన అంగరక్షకుడు 'లీ'కి చెప్పిన మాటలు ఆయన ముందుచూపును వెల్లడిస్తున్నాయి. అందులోనూ వాస్తవాలను రాయమని నొక్కి చెప్పటం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ప్రచురించిన ఫొటోలూ బాగున్నాయి. ఇక పుస్తకంలోకి వెళితే రచయిత దీన్ని 20 అంశాలుగా విభజించి రచించారు. ప్రతి ఒక్కటీ మావోని ప్రతిబింబించాయి అంటే అతిశయోక్తి కాదు.

ఇంకా ఈ పుస్తకంలో మావో గురించి లీ చెప్పిన మరికొన్ని వాస్తవాలు.. ఆయన మాటల్లోనే.. ''మావో తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపేవారో అంతే కఠినంగానూ ఉండేవారు. అది ఆయన ఆదర్శాన్ని వెల్లడిస్తుంది. ఆయన నిరంతర అధ్యయనశీలి, ఆయనకు పుస్తకాలంటే అపారప్రేమ. మావోకు మిరియాలన్నా, పందిమాంసం అన్నా ఎంతో ఇష్టం. తనపై వచ్చిన విష ప్రచారాన్ని చేతల్లో తిప్పి కొట్టిన ధీశాలి.. నిరాడంబరుడు. 'నీలో ఇంకా బూర్జువా దర్పం పోలేదు' అని భార్య గురించి మావో చేసిన వ్యాఖ్యలు ఆయన వర్గదృష్టిని తెలుపుతుంది. 'నాకన్నా అధార్టీగా రాసిన వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి అవి చదవండి. వాటిల్లో మార్క్స్-లెనిన్ రాసిన పుస్తకాలు ప్రత్యేకంగా చదవండి' అంటూ మావో భవితకు మార్గనిర్దేశం చేసేవాడు. తైవాన్ను చైనాలో కలపలేకపోయానని మావో బాధపడేవాడు. అది తన తీరని కలని అంటుండేవాడు..''
ఇలా మావో గురించిన ఎన్నో సత్యాలు తెలుసుకోవాలంటే.. ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment